రైతు వేదికలో అంగన్వాడి పక్షోత్సవాల వేడుకలు.
Published: Tuesday April 04, 2023
ఎర్రుపాలెం ఏప్రిల్ 3 సోమవారం ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఐసిడిఎస్, సి డి పో ,అధ్యక్షతన పక్షోత్సవాలు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ చిరుధాన్యాలపై వాటి ప్రాధాన్యతను గురించి వివరించారు .అనంతరం సిడిపిఓ తల్లులకు పోషక విలువలు గూర్చి తెలియపరచారు. ఈ కార్యక్రమం మార్చి 23 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, ఏ సి డిపో కృష్ణ శ్రీ ,సూపర్వైజర్ శశి ,జడ్పిటిసి సేలం కవిత ,అధికారులు ఎంపీడీవో శ్రీనివాసరావు ,వైద్యాధికారులు, గ్రామ సర్పంచి మొగిలి అప్పారావు, ఎంపిటిసిలు,అంగన్వాడీ టీచర్స్, డి వీర కుమారి, ఆశ ,సీతా కుమారి, ప్రమీల ,వసంత రేఖ ,ఆయాలు ,ఆశలు ,తల్లులు, తదితరులు పాల్గొని ఈ వేడుకలను అత్యంత ఘనంగా ముగించారు.
Share this on your social network: