కొండం రాజు పార్థివ దేహానికి నివాళులర్పించిన సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్
Published: Monday January 17, 2022
బోనకల్, జనవరి 16 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో జొన్నలగడ్డ కొండం రాజు ఆదివారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మరణించినారు. వారి పార్థివ దేహానికి గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి సర్పంచి కొమ్మినేని ఉపేందర్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు షేక్ జానీ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున రావు, వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వట్టికొండ రాము, పొందూరు రాంబాబు, పోతన బోయిన కృష్ణ, గుండ గాని రాంబాబు, సత్యం, నరసయ్య సీనియర్ నాయకులు బోయినపల్లి నాగయ్య, సరికొండ వెంకటపతి రాజు, చేబ్రోలు రవి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: