డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి

Published: Monday November 28, 2022

కార్పొరేటర్ రమ వెంకటేష్ యాదవ్

మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి)
 బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 24 డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక  కార్పొరేటర్ గుర్రాల రమ వెంకటేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్లోని బయ్యన నగర్ నుండి సాయి దుర్గ నగర్ కాలనీ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ పాల్గొని కార్పొరేటర్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్లోని బయ్యన నగర్ కాలనీ, జ్యోతి నగర్ కాలనీ, ఈస్ట్ జ్యోతి నగర్ కాలనీ,అమూల్య దివ్య నగర్ కాలనీ మరియు గణేష్ నగర్ కాలనీ వాసులు అలాగే టీఆర్ఎస్ నాయకులు  నూనె బాలయ్య యాదవ్,అవుల శ్రీశైలం యాదవ్,గుర్రాల రము యాదవ్, చెర్ల పరమేష్ యాదవ్, సాయి కుమార్ యాదవ్ ,ప్రదీప్ పాల్గొన్నారు.