ఈటేల కారు దిగి భాజపా తీర్థం పుచ్చుకున్నారు

Published: Wednesday June 16, 2021
బాలపూర్:(ప్రతినిధి) ప్రజాపాలన : తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిల్లి లోనిభారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి ధర్మేందర్ ప్రధాన్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో సోమవారం నాడు కాషాయపు కండువా కప్పుకొని తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఈటల రాజేందర్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో భారీ కాన్వాయ్ గా తరలి వచ్చిన వారందరూ ఈటల రాజేందర్ ను కలిశారు. ఈటేలకు  పూలమాలతో, శాలువాలతో  తెలంగాణ ఉద్యమకారునికి స్వాగతం పలికిన భాజపా సభ్యులందరూ పాల్గొన్నారు.