మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం

Published: Thursday October 14, 2021

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 13, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఎంపీపీ కృపేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహేష్ బాబు, ఇబ్రహీంపట్నం మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శాంతిశ్రీ ఆధ్వర్యంలో బాలికా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సి డి పి ఓ శాంతిశ్రీ మాట్లాడుతూ బాలికలను చదివించాలని ఆడపిల్లలు దేశానికే గర్వకారణమని కావున ఆడపిల్లలకు చదువు ఇంటికి వెలుగు అని తెలిపారు. అనంతరం బతుకమ్మలను వరుసగా చేర్చి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మహిళలు, అధికారులు సిబ్బందితో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ కప్పరి శ్రవంతి, మహిళలు పంచాయతీ రాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.