అర్హులైన వారికి రేషన్ కార్డులు పంపిణీ

Published: Tuesday July 27, 2021
బాలాపూర్, జులై 26, ప్రజాపాలన ప్రతినిధి : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కలెక్టర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి  మున్సిపాలిటీల కార్పోరేషన్ ల పరిధిలో ఉన్న ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ లతో కలిసి ముఖ్య అతిథి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ చేతుల మీదగా సోమవారం నాడు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ మేయర్ మాట్లాడుతూ.... రేషన్ కార్డులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం లాగా మారిపోయిందని, దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి ఇప్పుడు ఇవ్వడం జరిగిందని, మిగిలిన వారికి కూడా వస్తాయని తెలిపారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డు వచ్చేటట్లు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..... అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుపతి రావు, బాలాపూర్  ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, మీర్ పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్, జలపల్లి చైర్మన్ అబ్దుల్లా సాదిక్, బడంగ్ పేట్, మీర్ పేట్ డిప్యూటీ మేయర్లు ఇబ్రమ్ శేఖర్, తీగల విక్రమ్ రెడ్డి, బడంగ్ పేట్ కమిషనర్ లు  కృష్ణ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డి. ఇ లు అశోక్ రెడ్డి, గోపీనాథ్, ఏ. ఇ లు బిక్కు నాయక్, రాంప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్, కార్పొరేటర్లు పెద్ద బావి శోభ ఆనంద్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, సూర్ణగంటి అర్జున్, ఏనుగు రామ్ రెడ్డి, భీమిడి స్వప్న జంగారెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.