గ్రామ ప్రజల బాగోగులు తమపై ఉన్నదనే సంకల్పంతో...
Published: Wednesday May 26, 2021
బీరుపూర్, మే 25 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ గ్రామంలో కట్టక్రింది గూడెం అయిన ఎస్టీ కాలనీలో తట్ల రాజవ్వ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మరణించింది. కరోనా భయంతో వైకుంఠ దామనికి తీసుకెళ్లడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో గ్రామ సర్పంచ్ గర్షకుర్తి శిల్ప గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కేటాయించిన కూడ ఎవరు ట్రాక్టర్ నడపడానికి ముందుకు రాకపోవడంతో.. గ్రామ ప్రజల బాగోగులు బాధ్యతలు తమపై ఉన్నదన్న దృఢ సంకల్పంతో.. గ్రామ సర్పంచ్ భర్త గర్షకుర్తి రమేష్ ముందుకు వచ్చి మృతదేహాన్ని టాక్టర్ లో తీసుకెళ్లి దహన సంస్కరణాల కారేక్రమాలను పూర్తి చేశారు.
Share this on your social network: