అదుపుతప్పి ఇసుక ట్రాక్టర్ బోల్తా శంకరపట్నం మార్చ్10 ప్రజాపాలన రిపోర్టర్ :
Published: Saturday March 11, 2023
శంకరపట్నం మండల కేంద్రంలో వీణవంక మండలం మామిడాల పల్లి నుండి కేశవపట్నం మీదుగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ టీఎస్02 యూసీ 8044 అదుపుతప్పి మితిమీరిన వేగంతో ముత్తారం మలుపు నుండి హుజురాబాద్ వైపు వెళ్తుండగా పోలీస్ స్టేషన్ వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టుగా ప్రాణాపాయం తృటిలో తప్పింది. విధి నిర్వహణలో ఉన్న బ్లూ కోల్డ్ సిబ్బంది కానిస్టేబుల్ కుమార్, హోంగార్డు రవి ఘటన స్థలం వద్ద ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేశారు. కాగా ట్రాక్టర్ డ్రైవర్ బోల్తా పడిన ట్రాక్టర్ లోని ఇసుకను అన్లోడ్ చేసి ట్రాక్టర్ నిలబెట్టినారు.
Share this on your social network: