వికలాంగులను దాతలు ఆదుకోవాలి

Published: Wednesday June 23, 2021
మేడిపల్లి, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : వికలాంగులకు దాతలు సహాయం చేసి ఆదుకోవాలని శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ అధ్యక్షులు కుర్వ తమన్నా విజ్ఞప్తి చేశారు. కరోనా విపత్తులో వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. బోడుప్పల్ ఇంద్ర నగర్లోని శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ కు బియ్యం, పప్పు, నూనె, చక్కెర, చింతపండు మొదలగు నిత్యవసర వస్తువులను ఏ వన్ రైస్ పౌండేషన్ సభ్యురాలు సరిత అందజేశారు. కరోనా విపత్తులో మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి వికలాంగులను ఆదుకోవాలని ట్రస్ట్ అధ్యక్షులు తమన్నా విజ్ఞప్తి చేశారు. దాతలు వస్తు రూపంలో గాని ఇతర సహాయం చేయదలుచుకున్న వారు ఫోన్ నెంబర్ను 9177745159 సంప్రదించాలని ఆయన కోరారు