మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంది ** ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ **

Published: Tuesday September 27, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 26(ప్రజాపాలన, ప్రతినిధి) : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీపీ అది గల మల్లికార్జున్ యాదవ్ తెలిపారు. సోమవారం 12 చెరువులకు సంబంధించి చేప పిల్లలను ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మత్స్యకారులను  ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వారు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సహిస్తుందని అన్నారు. మండల పరిధిలోని 12 చెరువుల్లో  చేప పిల్లల పెంపకం ద్వారా వారి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ ఆహమ్మద్, ఎంపీడీవో ప్రసాద్, చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాస్, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.