గంటలోనే దొంగతనం చేధించడంతో రాయికల్ పోలీసులకు పలువురి అభినందనలు
Published: Wednesday December 28, 2022
రాయికల్, డిసెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన ఉడుత శ్రీనివాస్ అనే వ్యక్తి రాయికల్ పట్టణంలో ఓ సెల్ పాయింట్ దుకాణం నిర్వహిస్తున్నాడు, షాపుకు కిరాయి చెల్లించడానికి తెచ్చుకున్న 1లక్షా30వేల రూ.లను షాపులో పెట్టుకోవడంతో, ఇట్టి కిరాయి డబ్బులను ఓ దొంగ దొంగిలించి పారిపోతుండగా రాయికల్ ఎస్సై కిరణ్ కుమార్ గౌడ్ కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఆయన సిబ్బంది ని అలర్ట్ చేయడంతో పోలీసులు ఇద్దరు యువకుల సహాయంతో దొంగను పట్టుకొని పోయిన 1లక్ష 30 వేల రూ.లను రికవరీ చేసి సెల్ పాయింట్ యజమానికి అందించారు. ఈ విధంగా పోయిన డబ్బులను వెంటనే రికవరి చేసిన యస్.ఐ పబ్బం కిరణ్ కుమార్ గౌడ్ ను, పోలీసుశాఖ వారిని ప్రజాప్రతినిధులు, మండల ప్రజలు అభినందిస్తున్నారు.
Share this on your social network: