అర్ధరాత్రి సిటీవో అధికారులు తనీఖీలు...

Published: Wednesday November 16, 2022
అర్ధరాత్రి సిటీవో అధికారులు తనీఖీలు...
 
పాలేరు నవంబర్ 15  ప్రజా పాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండల కేంద్రంలో అర్ధరాత్రి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు విస్త్రుతంగా తనీఖీలు చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి మండల
 
కేంద్రలలో వాహనాలు ఆపి పత్రాలను తనీఖీలు చేపట్టారు. ఒక్కసారిగా వాహనాలు ఆపి తనీఖీలు చేపట్టటంతో సెంటర్ ఏం జరుగుతుందోనని
 
ఆందోళన చెందారు. కమర్షియల్ అధికారులు వాహనాలను ఆపి అందులో ఉన్న సరుకులకు తగినట్లుగా పత్రాలు ఉంటేనే వాహనాలను
 
పంపించారు. ఈ సందర్భంగా సీటీవో అధికారి ధశరద్
 
మాట్లాడుతూ...ఉన్నాతాధికారులు ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా
 
తనీఖీలు చేపట్టినట్లు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు బృందాలు, గా విడిపోయి, తనీఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఆయన వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు.