రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం ** ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 29 (

Published: Wednesday November 30, 2022
జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలకు చెందిన 7గురు విద్యార్థులు "రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్" పోటీలకు ఎంపికైన సందర్భంగా విద్యార్థులను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖలీల్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ప్రేమ్ కుమార్ లు మంగళవారం సన్మానించారు. 
జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రథమ బహుమతి పొందిన ఈ.నవిత, సెండె సాద్విక, మౌల్కర్ సాహితి, కృష్ణవేణి, ఈ.శిరీష, ఆర్.ఎస్.కృష్ణ, మహిమ ప్రసన్న లు రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు డిసెంబర్ 5 నుండి 8వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరుపున పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ తో పాటు, వైఎస్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, సభ్యులు తిరుమల, లావణ్య, పాల్గొన్నారు.