ఎస్ ఆర్ ఠాగూర్ లోని దూర విద్యా కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కోఆర్డినేటర్....

Published: Tuesday February 22, 2022
వైరా ప్రజలపాలన ప్రతినిధి : స్థానిక ఠాగూర్ విద్యా సంస్థ లోని ఇంటర్ దూర విద్యా కేంద్రాన్ని జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి తగు సూచనలు చేశారు దూర విద్యా కేంద్రం ద్వారా విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్స్ రెగ్యులర్విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్ తో సమానం అని తెలిపారు చదువు మానేసిన వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దూరవిద్య కేంద్రాలను నిర్వహిస్తుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రవికుమార్ చైర్మన్ సంక్రాంతి సునీత అసిస్టెంట్ కోఆర్డినేటర్ చింత నిప్పుకృష్ణారావు నాగలక్ష్మి లింగారావు విద్యార్థులు పాల్గొన్నారు