ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య కార్డ్ కొరకు దరఖాస్తులు స్వీకరణ
Published: Saturday February 25, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య కార్డ్ కొరకు దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను హబ్సిగూడ డివిజన్ గాంధీ గిరిజన బస్తీలో స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ ప్రారంభించగా రామంతాపూర్ డివిజన్ కామాక్షి పురంలో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కన్నావత్ రాజు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
Share this on your social network: