కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రచారం..
Published: Saturday June 11, 2022
తల్లాడ, జూన్ 10 (ప్రజాపాలన న్యూస్): ఎనిమిదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో చేసిన పథకాలపై బిజెపి పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకటరామారావు ప్రచారం నిర్వహించారు. శుక్రవారం మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ రావు, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Share this on your social network: