సివరేజ్ పైప్ లైన్ పనుల పరిశీలించిన కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు

Published: Tuesday June 28, 2022
మేడిపల్లి, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి)

రామంతాపూర్ డివిజన్ ఎండోమెంట్ కాలనీలో రూ 15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సివరేజ్ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పరిశీలించారు. అలాగే స్థానికుల ఫిర్యాదుమేరకు రాజేంద్ర నగర్, భూగర్భ డ్రైనేజీ పైపులైను పనులను కూడా పరియవేక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్ రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి నారాయణ దాసు, తాళ్ల బాల కృష్ణ గౌడ్, దయాకర్ రెడ్డి, నగరాజ్ యాదవ్, నరసింహ రావు, నిశాంత్, వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ కిషన్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ తదితరులు  పాల్గొన్నారు.