మట్టి గణేష్ విగ్రహాలే తయారు చేయాలి

Published: Wednesday June 15, 2022
 డీసీ  అరుణ కుమారి 
మేడిపల్లి, జూన్14 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో  పర్యావరణానికి మేలు చేసే మట్టి  గణేష్ విగ్రహాలను తయారు చేయాలని డిప్యూటీ కమిషనర్ సి. అరుణ కుమారి తయారీ దారులకు సూచించారు. పర్యావరణానికి హాని చేసే రసాయనాల విగ్రహాలు వద్దని అన్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాలలో గణేష్ విగ్రహాల తయారీ దారులతో సర్కిల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మట్టి గణేష్ విగ్రహాలే తయారు చేయాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. ప్రభుత్వాదేశాలను ఎవరూ అతిక్రమించొద్దని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత, కర్తవ్యమని గుర్తు చేశారు. ఈ సమావేశంలో  ప్రాజెక్టు ఆఫీసర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.