శ్రీ కోటేశ్వర స్వామికి లేగదూడలు సమర్పణ

Published: Tuesday March 16, 2021

వెల్గటూర్, మార్చి 15(ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవాలయమునకు సోమవారం రోజున జగిత్యాల జిల్లా మండలం లోని గోపాల్ రావు పేట కు చెందిన రౌతు రాజిరెడ్డి, రౌతు గంగాధర్ స్వామి వారికి మూడు లేగా దూడలను మొక్కుగా చెల్లించుకున్నారు. లేగ దూడల సంరక్షణ కోసం మరియు ఇతర భక్తులు కోటేశ్వర స్వామి కి ఇచ్చే గోవుల సంరక్షణ కు గోశాల ఏర్పాటు చేయాలని ఇట్టి గోశాలకు సహాయ సహకారాలు అందిస్తామని భక్తులు తెలియజేశారు. ఆలయానికి సంబంధించిన చైర్మన్ గారు మరి ఈవో గారు చొరవ తీసుకుని గోశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.