శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల జాతర

Published: Wednesday April 27, 2022

హాజరైన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్.కె.సంజయ్ కుమార్

రాయికల్, ఏప్రిల్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణ కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి పట్నాలు మరియు బోనాల జాతర మహోత్సవానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్. సంజయ్ కుమార్ హాజరై ఎల్లమ్మ దేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దయవల్ల అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని,మంచి వర్షాలను ఇవ్వాలని కరోనా వంటి రోగాలు రావద్దని అన్నారు. రాయికల్ ను గ్రామం నుండి మున్సిపల్ గా మార్చామని పట్టణంలో రోడ్లు ,డివైడర్లు, పారిశుద్ధ్య కోసం నూతన వాహనాలు కొనుగోలు చేశామని, పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గామార్చుతామని వేసవి కాలంలో సైతం చెరువు నిండుకుండలా తలపిస్తుందని, పట్టణంలో సీసీ కెమెరా లను అమర్చా మనీ ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టామని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దయ వల్ల మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, ఎంపీపీ సంధ్యారాణి సురేంద్ర నాయక్, ఏఎంసీ చైర్మన్ రాజారెడ్డి, రాయికల్ పట్టణ వార్డు కౌన్సిలర్ లు టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మోర రామ్మూర్తి టిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఏ లిగేటీ అనిల్ కుమార్ టిఆర్ఎస్ నాయకులు గౌడ సంఘం అధ్యక్షులు, సంఘ సభ్యులు, నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు