మన ఊరు మన బడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందాల.

Published: Tuesday April 19, 2022
పాలేరు ఏప్రిల్ 18 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం మండల పరిషత్  ప్రాథమిక పాఠశాల నందు మన ఊరు - మనబడి కార్యక్రమన్ని ప్రారంభించిన పాలేరు శాసనసభ్యుడు కందాల ఉపేందర్ రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధు, పిల్లలతో మాట మంచి మాట్లాడి అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, నేలకొండపల్లి సర్పంచ్ రాయపూడి నవీన్, తదితరులు పాల్గొన్నారు