వాటర్ ఛాలెంజ్ ఫర్ బర్డ్స్ కరపత్రం విడుదల

Published: Monday March 28, 2022
మంచిర్యాల టౌన్, మార్చి 27, ప్రజాపాలన : మంచిర్యాల పట్టణ తెరాస యువజన అధ్యక్షుడు బింగి ప్రవీణ్, వాటర్ ఛాలెంజ్ ఫర్ బర్డ్స్ అనే కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయటం జరిగింది.తదనంతరం ఎమ్మెల్యే స్వగృహం నందు పక్షులకు ఒక మట్టి పాత్రలో నీరు, మరో పాత్రలో ధాన్యపు గింజలు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ఎండాకాలంలో ఎండ వేడికి తట్టుకోలేక ఎన్నో రకాల జాతి పక్షులు చనిపోవడం జరుగుతుంది, కావున ప్రతి ఒక్కరూ పక్షి జాతి అంతరించి పోకుండా మీ మీ ఏరియాలో కావచ్చు, మీ ప్రాంతంలో లేదా మీ ఇంటి ఆవరణంలో రెండు మట్టి పాత్రలలో ఒక దానిలో నీరు, మరో దానిలో ఆహారపు గింజలు పెట్టినట్లయితే ఎన్నో రకాల పక్షులను కాపాడిన వారవుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో  నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, తెరస మాజీ పట్టణ అధ్యక్షుడు 32వ కౌన్సిలెర్ గాదే సత్యం, నాయకులు రవీందర్ రావు, దబ్బేట రామన్న, పానుగంటి శ్రీనివాస్, జూపక సుదీర్, సాగర్, సదానందం, కాళిల్, సూదమల్ల అశోక్ తేజ, బల్లికొండ రమేష్, పుల్ల అనిల్ గౌడ్, చేరల వంశీ, ఇమ్రాన్, రూపేష్, శ్రీకాంత్, నాగ మలేష్, శ్రవణ్ సాత్విక్, చరణ్, విట్టు, తదితరులు పాల్గొన్నారు..