గంథం ఫౌండేషన్ అధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సినీ నటుడు శివారెడ్డి బొంతు రామ

Published: Saturday March 26, 2022
మేడిపల్లి, మార్చి 25 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ చిన్న చెరువులో  గంధం ఫౌండేషన్ అద్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా  ప్రముఖ సినీనటుడు, మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడలు మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. యువత మొబైల్ ఫోన్ లకు అలవాటు పడి క్రీడల పట్ల ఆసక్తి కోల్పోయి, అనారోగ్యంపాలు అవుతున్నారని సినీ నటుడు శివారెడ్డి తెలిపారు. వ్యాయామం, ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించి క్రీడాస్ఫూర్తి నెలకొల్పుతున్న నిర్వహకులు గంధం ఫౌండేషన్ చైర్మన్ గంధం నాగేశ్వరరావును అభినందించారు. ఈ సందర్భంగా గంథం ఫౌండేషన్ చైర్మన్ గంథం నాగేశ్వరావు మాట్లడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీలలో 18 జట్లు పాల్గొంటాయని, ప్రధమ బహుమతి రూ 27000 గాను, ద్వితీయ బహుమతి రూ 7000 రూపాయల బహుమతి, ట్రోఫీ ని అందచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజన్న, రెడ్డి సంఘం ప్రతినిధి నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేకల హనుమంత్ రెడ్డి, సదానంద్, జగదీష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రవిచారి, తుట్ నరసింహ, వెంపటి శ్రీను, మనీష్, శ్రీనివాస్, సమీర్, సాగర్, కిరణ్, సాయి, మున్నా, లడ్డు, మరియు  క్రీడాకారులు అదికసంఖ్యలో పాల్గొన్నారు.