నిప్పు నుండి అడవులను రక్షించాలి

Published: Thursday March 04, 2021

జన్నారం మార్చి 3 ప్రజా పాలన: నిప్పు నుండి అడవులు రక్షించాలని పేర్కొంటూ బుధవారం ఎఫ్ డి ఓ ఏ మాధవరావు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ డి వో మాట్లాడుతూ అడవులకు నిప్పు పెట్టరాదని అడవులను రక్షించాలని  ఇది అందరి సామాజిక బాధ్యతగా చూడాలన్నారు. ఎవరైనా అడవికి నిప్పు పెట్టినచో అరెస్ట్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ వెంకటేశ్వరరావు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.