ఆర్జేసీ ఇంటింటి ప్రచారం

Published: Wednesday March 03, 2021
ఖమ్మం (ప్రజాపాలన ప్రతినిధ) మార్చి 2: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాలు జోరందుకొన్నాయి అధికార టీఆరెస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ముమ్మర ప్రచారాలు నిర్వహిస్తున్నారు.అందులో భాగంగానే ఖమ్మం నగరం లోని త్రీ టౌన్ ఏరియాలో వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మెన్. టీఆరెస్ పార్టీ జిల్లా కార్యలయ ఇన్చార్జ్. గుండాల కృష్ణ,(ఆర్జేసీ కృష్ణ,) ఆద్వర్యం లో పల్లా ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎం.ఎల్.సి నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు కోసం  మంగళవారం త్రీ టౌన్ ప్రాంతంలో ని  పలు డివిజన్లలో ప్రచారం చేసారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారకార్యక్రమాలు  నిర్వహించారు.ఈ సందర్బంగా  కృష్ణ  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి లో పయనిస్తోందన్నారు.దీనిలో భాగంగా జిల్లాలో మంత్రి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు పల్లా రాజేశ్వర రెడ్డి ని గెలిపించి కేసీఆర్ కు బలం చేకూర్చాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పాలడుగు పాపారావు, పార్టీ నాయకులు పసుమర్తి రామ్మోహన్, నీలం కృష్ణ, కన్నం ప్రసన్న కృష్ణ, గజ్జెల వెంకన్న, సుబ్బారావు, రాంబాబు, బొజేడ్ల రామ్మోహన్, వంగాల వెంకట్, చేతిక్రిష్ణ, కనకం భద్రయ్య, దేవర వెంకన్న తదితరులు పాల్గొన్నారు...