AISF జిల్లా ఖమ్మం జిల్లా 26వ మహాసభలను జయప్రదం చేయండి.
ఎర్రుపాలెం డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఏఐఎస్ఎఫ్ మహాసభలో భాగంగా విద్యారంగ సమూల మార్పు కై ఉద్యమ రూపకల్పనకు వేదిక గా ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు. నిర్వహించబోతుదినీ AISF జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ పేర్కొన్నారు. స్థానిక బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి కరపత్రాలు ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా 26వ మహాసభలు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖమ్మం సిటీ ఫంక్షన్ ఈనెల 20, 21 తేదీలలో జరుగుతున్నాయి, కావున ఈ మహాసభను జయప్రదం చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యారంగ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చే ఏడు సంవత్సరాలు అవుతున్నా బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానాలను కొనసాగిస్తు దుర్మార్గమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆవేదన వ్యక్తం చేశారు విద్యారంగాన్ని. విస్మరించి ముఖ్యమంత్రులు పరిపాలించిన గత ముఖ్యమంత్రులు కు పట్టిన గతే కేసీఆర్కు పడుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఏసీ గదుల్లో కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ విద్యార్థులకు కనీస వసతులు కల్పించలేని అసమర్థత ముఖ్యమంత్రికి పతనం తప్పదని హెచ్చరించారు. విద్యారంగంలో ప్రవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు కేంద్రం తెరలేపిందని, పేదలు, మద్యతరగతి వర్గాల పిల్లలకు విద్యను దూరంచేసే విదంగా కేంద్రం నిర్ణయాలు చేస్తోందన్నారు. కేంద్రం తీసుకువస్తున్న 2020 విద్యా విదానం ప్రభుత్వ విద్యను కనుమరుగు చేసేందుకేనని అన్నారు, విద్యార్ధులను ఆలోచింపచేసే లౌకిక, ప్రజాస్వామ్యం వంటి పదాలను తొలగించి విద్యా కాషాయీకరణ కు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. రైతన్నల శ్రమను కార్పోరేట్ శక్తులు, దళారీలకు దోచిపెట్టే విధంగా సాగు చట్టాలు, విద్యుత్ సంస్కరణ బిల్లులు తీసుకువచ్చారని విమర్శించారు. పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా మారిన ఇంధన, నిత్యావసర ధరలు అదుపుచేయడంలో పాలకులు విఫలం చెందారన్నారు. కార్మిక చట్టాలను సవరిస్తూ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి, యువజనులను మోసం చేస్తూ పాలన సాగిస్తోందని, పోరాడి సాధించుకున్న తెలంగాణాలో నిరుద్యోగం రాజ్యమేలుతోందన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేస్తూ మరోవైపు కార్పోరేట్ విద్యాసంస్థల ఏర్పాటుకు విచ్చల విడిగా అనుమతులిస్తూ పేద విద్యార్ధులను విద్యకు దూరంచేసే కుట్రలు చేస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యతిరేక విధానాలను మానుకొని ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అన్నారు లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో AISF ఎర్రుపాలెం మండల నాయకులు నాగబోయిన సాయికుమార్ బిమల హర్షవర్ధన్ కుసుమ రాజు వెంకటేష్ ముల్లంగి బోస్ ఉపేందర్ రాధా కృష్ణ స్వాతి సరిత హరిణి మౌనిక వేదన కీర్తి దీప్తి జ్యోతి కావ్య నవ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...