ఏప్రిల్ 5 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ
బోనకల్, ఏప్రిల్ 2 ప్రజా పాలన ప్రతినిధి: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గత ఎనిమిది ఏళ్లుగా దేశంలో అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద అనుకూల విధానాలను, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణం విరమించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణపు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. చలో ఢిల్లీ గోడపత్రికలను ఆదివారం సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అఖిలభారత సంఘాల పిలుపులో భాగంగా రాష్ట్రంలో సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామస్థాయి నుండి మండల, జిల్లా కేంద్రాల వరకు విస్తృత ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన చలో పార్లమెంటు కార్యక్రమం సందర్భంగా నిర్వహించనున్న ఢిల్లీ మజ్దూర్ కిసాన్ సంఘర్షణ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల హక్కులు, కార్మిక చట్టాల రక్షణ, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు, విద్యుత్ సవరణ బిల్లు - 2022 ఉపసంహరణ, మాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు, పని దినాలు 200 రోజులకు పెంచి, కనీస వేతనం రూ.600 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలను నియంత్రించడం, రైతు పండించే అన్ని ఉత్పత్తులకు కనీసం మద్దతు ద్వారా నిర్ణయించి కొనుగోలను గ్యారెంటీ చేయాలని, ఒకేసారి కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసి 60 ఏళ్లకు పైబడిన వారందరికీ పెన్షన్ అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరింప చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో బిజెపి ప్రకటించిన అభివృద్ధి నినాదం కారు మబ్బులా కరిగిపోయిందని విమర్శించారు. బిజెపి పరిపాలనలో దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి సవాల్ ఎదురైందన్నారు. కనీస వేతనం 26 వేల, పెన్షన్ రూ. 10,000 అందరికీ చెల్లించాలని, ప్రజలకు నష్టం కలిగించే స్కీములు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారెంటీతో కూడిన సేకరణతో పాటు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఉండేలా చట్టబద్ధత కల్పించాలని కోరారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, ఆహార వస్తువులు, నిత్యవసర సరుకులపై జిఎస్టి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నాణ్యమైన ఆరోగ్యం, విద్యను అందించడం, జాతీయ విద్యా విధానం 2022ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధనవంతులపై పన్నును విధించాలని, కార్పొరేట్ పన్నులు పెంచాలని, సంపద పన్నును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం కఠినంగా అమలు చేయాలని, అటవీ పరిరక్షణ చట్టం యొక్క సవరణలు, నిబంధనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలపై భారాలు మోస్తూ పెట్టుబడిదారుల కార్పొరేట్ సంస్థలకు ప్రజా సొమ్మును కారు చౌకగా కట్టబెడుతుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం మతోన్మాదం పేరుతో పరిపాలన చేస్తూ దేశాన్ని నాశనం చేసే పరిపాలన చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, మండల ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా(బుజ్జి) భవన నిర్మాణ కార్మికులు జంపాల సాంబయ్య, షేక్ బాజీ, నరెడ్ల వెంకటి, మల్లెల గోపి, జంపాల నరసింహారావు, ఆర్ కన్నయ్య, ఎర్రగాని నాగేశ్వరరావు, బంధం వెంకటేశ్వర్లు, షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...