సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు లక్ష రూపాయల విరాళం : పట్నం అవినాష్ రెడ్డి*

Published: Thursday January 19, 2023
*ప్రజాపాలన షాబాద్* ::=షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి మరొకసారి పెద్ద మనసును చాటుకున్నారు.  మండల కేంద్రం
లో  విద్యాభివృద్ధిలో భాగంగా సంస్కృతి, సంప్రదాయాలతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలకు లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పాఠశాల పరిస్థితిని తెలుసుకున్న అవినాష్ రెడ్డి యాజమాన్యం కోరిన వెంటనే 
సరస్వతీ శిశు మందిరం అభివృద్ధి కోసం తనవంతుగా సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఘనత షాబాద్ శిశు మందిరం పాఠశాలకు ఉందని అన్నారు. తన వంతుగా మరో ఐదు లక్షల వరకు నిధులను అందించే ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే మంత్రి *కేటీఆర్ స్పూర్తితో* మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ 25 లక్షల స్వంత 
నిధులతో *గిఫ్ట్ ఏ స్మైల్* కింద బెంచీలను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సహకార సంఘం చైర్మన్ చల్ల శేఖర్ రెడ్డి, సంకేపల్లి గూడా సర్పంచ్ కుమ్మరి దర్శన్, తిమ్మాపురం మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ రాములు, పాఠశాల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, సభ్యులు నారాయణ, యాదవ రెడ్డి, గౌరిశంకర్,
టిఆర్ఎస్ పార్టీ కార్మిక భాగం సీనియర్ నాయకులు రాందేవ్ యాదవ్,  పీఆర్ఆర్ కళాశాల   మాజీ ప్రిన్సిపాల్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.