*ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం : జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి*

Published: Friday January 13, 2023
ప్రజాపాలన షాబాద్ ===ఆపదలో ఉన్న ప్రతికుటుంబాన్ని  ఆదుకుంటామని షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు.  గతంలో రోడ్డు ప్రమాదంలో త్రీవ్రంగా 
గాయపడి కాలును కోల్పోయిన 
మండలంలోని వెలుగొండ గ్రామానికి చెందిన అణపురం నర్సిములు భార్య మమతకు రెండు లక్షల 50 వేల సీఎం ఆర్ ఎఫ్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ నిధులను అందిస్తుందని ఏమైనా ప్రమాదాలు జరిగితే తమకు తెలియకుండా ఎవరినైనా అడిగి తెలుసుకుని సీఎంఆర్ఎఫ్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలును కోల్పోయిన మమత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. ఎంపిటిసి మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి, శ్రీశైలం గౌడ్, శివకుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, రాందేవ్, షాబాద్ మండల పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముఖరం ఖాన్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.