ఘనంగా తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Wednesday April 28, 2021
పార్టీ జెండాను ఆవిష్కరించిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
జగిత్యాల, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రూరల్ మండల్ గోపాల్రావుపేట్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి ఉద్యమ కారులకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏ లక్ష్యం కోసం అయితే పోరాడారో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ లక్ష్య సాధనలో అడుగులు ముందుకు వేస్తున్నారని అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏడేళ్ల పరిపాలనలో ప్రతి తెలంగాణ వ్యక్తి ముఖంలో చిరునవ్వు చూడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్య సాధనను చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రౌతు జయ ఉప సర్పంచ్ బొడ్డు బుచ్చన్న మాజీ వైస్ ఎంపిపి గంగం మహేష్ వార్డు సభ్యులు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.