కళ్యాణా లక్ష్మీపథకం పేదల పాలిట వరం : గోలపల్లి ఎంపీపీ నక్కశంకర్

Published: Tuesday April 27, 2021
గొల్లపల్లి, 26 (ప్రజాపాలన ప్రతినిధి) : ​తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ లోని సమావేశ హాల్లో ఎంపీపీ నక్క శంకర్ జడ్పీటీసీ గోస్కుల జలంధర్ ల ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలానికి మంజూరు అయిన 17 కళ్యాణాలక్ష్మి చెక్కులు, విలువ రూ. 17,01,972 రూపాయల నిధులు లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో నక్క శంకరయ్య  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ పథకం పేదప్రజలకు వరంలా మారిందన్నారు. గొల్లపల్లి మండలానికి చెక్కులు మంజూరు చేసినందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నయాబు తహసీల్దార్ సుమన్ ఎంపీడీఓ జనార్దన్ ఎంపీఓ వెంకటేశ్వరరెడ్డి ఏఎమ్ సి చైర్మన్ ముస్కు లింగారెడ్డి, వైస్ఎంపీపీ ఆవుల సత్యం, గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి సంబంధించిన ఎంపీటీసీ లు సర్పంచులు ముఖ్య నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.