క్రీస్తు పునరుత్థాన పండుగ వేడుకలు

Published: Monday April 05, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 04 (ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపల్లిమండలం లోని అన్ని గ్రామాల్లో ని క్రైస్తవ సోదరి సోదరులు ఉదయం వేకువ జామున అన్ని చర్చిలలో శిలువజ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ​అనంతరం దైవజనులు సమాజాన్ని ఉదేశించి మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కొరినవ్యక్తి మానవుడు తనుచేసిన అతిక్రమనులను బట్టి శాంతిసమాధానం లేక జీవిస్తున్న సర్వమానవాలి తన ప్రేమచేత శాంతి రాజ్యం యేసు స్థాపించారు. సత్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించిన ప్రతిసారీ అది ఏదో రూపంలో తిరిగి జన్మిస్తునే ఉంటుంది అదేఈస్టర్ మనకు నేర్పే పాఠం ​యేసు తాను చెప్పినట్లుగా నేను చనిపోయి మూడవ రోజున లేస్తాను అనిపలికిన మాట నేటికి సజీవ సాక్ష్యం​గా ఇశ్రాయేల్ దేశంలో తెరువబడిన సమాధి సాక్షముగా ఉన్నది కావున క్రైస్తవ ఆదర్శ దైనందిన జీవనం కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవ. మనోహర్  పాస్టర్ సతీష్ డేవిడ్ సుధాకర్ సువార్తికులు గొర్రె జాకబ్ సల్మాన్ రాజు గొర్రె సమూయేలు మోజెస్ కొప్పులసుధాకర్ నల్ల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.