ముందుకు సాగని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే భూ సేకరణ
మధిర అక్టోబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవేకి కావలసిన భూసేకరణ మధిర నియోజకవర్గంలో ముందుకు సాగటం లేదు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేకసార్లు అధికారులు భూసేకరణపై రైతుల నుండి అభిప్రాయాలను సేకరించారు. రైతుల నుండి సేకరించే భూములకు ప్రభుత్వం ఏ రకమైన పరిహారం ఇస్తుందో వివరంగా అధికారులు చెప్పకపోవడంతో రైతుల భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. రైతన్న నుండి భూములు బలవంతంగా లాక్కుంటున్నారంటూ ఇప్పటికే చింతకాని మండలం కుదువురికి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం నుండి మధిర నియోజకవర్గం మీదుగా విజయవాడ వరకు నూతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రైతుల నుండి కావలసిన భూములను సేకరించేందుకు ఖమ్మం ఆర్డిఓ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో గతంలో రెండు సార్లు బాధిత రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేశారు. ఖమ్మం నుండి విజయవాడ వరకు 90 కిలోమీటర్ల వరకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవేని మంజూరు చేసింది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం 433 హెక్టార్ల భూమి అవసరం ఉంది. ఈ రహదారి వి వెంకటాయపాలెం నుండి మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కొదుమూరు నేరడ నాగిలిగొండ బోనకల్ మండలం తూటికుంట్ల నుండి వల్లాపురం, పెద్ద బీరవల్లి, బ్రాహ్మణపల్లి నుండి మధిర మండలం రొంపి మల్ల, సిరిపురం, ఆత్కూరు, మాటూరు, నిదానపురం, దెందుకూరు నుండి ఎర్రుపాలెం మండలం మీనవోలు, పెగళ్ళ పాడు, రేమిడి చర్ల మీదగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్తుంది. ఈ రహదారి ఖమ్మం జిల్లాలో 60 కిలో మీటర్లు ఉండగా కృష్ణా జిల్లాలో 30 కిలోమీటర్లు ఉంది. నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ రహదారి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. రహదారి నిర్మాణం చేసే గ్రామాల్లో రైతులకు చెందిన భూములు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రెవెన్యూ అధికారులు సేకరించాల్సి ఉంది. దీనిలో భాగంగా తొలి విడతలో వల్లాపురం, పెద్దబీరువల్లి, నిదానపురం, మీనవోలు బాధితుల రైతులతో అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం మరోసారి సిరిపురం గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయ భూములను ఎట్టిపరిస్థితిలో వదులుకునేది లేదన్నారు. కేవలం ఈ భూమిని నమ్ముకొని మాత్రమే వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషించుకుంటు న్నట్లు రైతులు తెలిపారు. కుటుంబ జీవనాధారానికి ఆసరాగా ఉన్న భూములు కాస్త ప్రభుత్వం తీసుకుంటే తామెలా బతకాలంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరూ ఏకగ్రీవంగా భూములు ఇచ్చేది లేదంటూ ఆర్డీవోకి వినతి పత్రాలు అందజేశారు. మరి కొంతమంది రైతులు మాత్రం ఎకరానికి కోటి రూపాయలు పరిహారం ఇస్తే తమ పంట భూములు ఇస్తామని చెబుతున్నారు దీంతో రెండేళ్లుగా గ్రీన్ ఫీల్డ్ హైవే భూముల సేకరణ కార్యక్రమం మందకోడిగా కొనసాగుతుంది.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...