కొండా లక్ష్మణ్ బాపూజి సేవలు మరువలేనివి

Published: Wednesday September 28, 2022

మధిర సెప్టెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి తెలంగాణ స్వతంత్ర సమర యోధుడు నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త కొండా లక్ష్మణ్ బాపూజి సేవలు మరువలేనివని ఎక్సైజ్ సిఐ నాగేశ్వరావు పేర్కొన్నారు. మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు  ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన మహనీయుడు అని ఆయన కొనియాడారు. బగుడు బలహీన వర్గాల కోసం తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు. బాపూజీ జీవితం  రేపటి తరానికి ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ శార్వాణి సిబ్బంది గోపయ్య, ముస్తఫా, గోపి, కృష్ణవేణి, ఇఫ్తాకర్ తదితరులు పాల్గొన్నారు.