అభివృద్ధికి ఆమడ దూరంలో దళిత స్మశాన వాటికలుచివరి మజిలీని అష్టకష్టాలతో పూర్తి చేస్తున్న దళిత
మధిర రూరల్ సెప్టెంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి మధిర నియోజకవర్గంలో ఉన్న దళిత స్మశానవాటికలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్న 142 గ్రామాల్లో సుమారు 120 గ్రామాల్లో దళితులకు స్మశాన వాటికలు ఉన్నాయి. కానీ దళిత స్మశానవాటికలో కనీస సౌకర్యాలు లేకపోవటంతో దళితులు అష్టకష్టాలు పడుతూ మృతదేహాలను సమాధి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాల్లో అయితే స్మశానవాటికలకు వెళ్లేందుకు సరి అయిన రహదారి కూడా లేదు. వర్షాకాలం అయితే మృతదేహాలను తీసుకొని స్మశాన వాటికలోకి వెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సి పరిస్థితులున్నాయి. దళితుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు పాలకులు చెబుతున్నా ఆచరణలో మాత్రం అవి అమలు కావడం లేదు. కొన్ని గ్రామాల్లో సమాధి చేయడానికి మృత దేహంతో పాటు దళిత స్మశాన వాటిక వద్దకు వచ్చిన బంధుమిత్రులు సమాధి చేసే వరకు ముక్కు మూసుకొని ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహకారంతో పిఎస్ఆర్ ట్రస్టు ద్వారా దళిత స్మశానవాటికలో పెరిగిన ముళ్ళకంప తొలగించి స్మశానవాటిక వద్దకు వెళ్లేందుకు చిన్నపాటి రహదారిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల కోసం వైకుంఠ దామాలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం దళిత స్మశానవాటికల అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ లీడర్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత స్మశానవాటికలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిధులతో వైకుంఠ ధమాలను నిర్మించింది. అక్కడ మౌలిక వసతులు సైతం కల్పించింది. అదేవిధంగా దళితులకు కేటాయించిన స్మశాన వాటిక లలో సైతం మౌలిక వసతులు కల్పించాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికి కూడా దళితులకు స్మశాన వాటికలు లేకపోవటం గమనార్హం. గ్రామాల్లో దళితులకు స్మశానవాటికలో ఏర్పాటు చేయాలని గతంలో అనేక రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం దళితుల స్మశాన వాటికలు ఏర్పాటు చేసి వాటిల్లో మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...