ఇందన్ పల్లి లో ఉచిత అరోగ్య వైద్య శిబిరం.

Published: Thursday September 22, 2022
జన్నారం, సెప్టెంబర్ 21,  ప్రజాపాలన: 
 
మండలంలోని ఇందన్ పల్లి గ్రామంలో ఉచిత అరోగ్య వైద్య శిబిరాన్ని ఎర్పాటు చేయడం జరిగిందని మండల వైద్యాదికారి ప్రసాద్ రావు అన్నారు, బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల ఇందన్ పల్లి గ్రామంలో సీజనల్ వ్యాదుల వ్యాప్తి నివారణ కోసం అరోగ్య వైద్య శిబిరం ఎర్పాటు చేశారు, ఈ సందర్భంగా స్థానిక రోగులను పరీక్షించి మందులు గోలీలు ఇచ్చారు,  ఇంటి పరిసరాల అవరణలో నీటి నిల్వలు నుండకూడదని తెలిపారు, మురికి గుంట్టలు తీసివేయాలి, నీటి గుంట్టల వలన దోమలు ఈగలు తయారు అవుతాయి, ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి నిల్వలు ప్రదేశాలు గుర్తించి దోమలు రాకుండ అందులో పినాయిల్ వేయించాలని తెలిపారు, మురికి కాల్వల్లో పూడిక తీసి వేయాలని ఇంటిలో నిల్వ ఉన్న నీటిని దోమలు ఈగలు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ  ప్రజలకు అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో వి పద్మావతి ఎచ్ఎ, పి సుశీల ఎచ్ఎస్, టి పోచయ్య ఎచ్ఎ, ఆశ వసంత ఎచ్ఎ, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.