నాలుగు రోజుల్లో రెండు సార్లు చోరీ.... బేకరీలో వరస దొంగతనాలు....

Published: Monday September 19, 2022
నాలుగు రోజుల్లో రెండు సార్లు చోరీ....
బేకరీలో వరస దొంగతనాలు....
 
 
పాలేరు సెప్టెంబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండల కేంద్రంలో వరస దొంగతనాలతో వ్యాపారులు
బెంబేలెత్తుతున్నారు. మండల కేంద్రానికి చెందిన సాయిరాం బేకరి లో
 
శనివారం రాత్రి చోరీ జరిగింది. గడ్డపారతో తాళాలు పగలగొట్టి, షట్టర్ లేపి చోరీకి పాల్పడ్డారు. అందులో ఉన్న బేకరి కి చెందిన పలు ఐటమ్స్ తో పాటు కొంత నగదు ను చోరీ కి పాల్పడ్డారు. గత నాలుగు రోజుల కిత్రమే ఇదే బేకరిలో సినిమా పక్కీలో చోరికి పాల్పడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు చోరికి పాల్పడి దాదాపు రూ.30 వేల కు పైగా విలువైన వస్తువులు చోరి చేసినట్లు బాధితులు తెలిపారు. ఓకే దుకాణంలో టార్గెట్ చేసి చోరికి పాల్పడుతున్నారంటే తెలిసిన వారే చోరీకి పాల్పడ్డారా...లేక దొంగల ముఠా సులువుగా ఉన్న దుకాణాలను ఎంచుకుంటుందా అనే విషయం పై పట్టణంలో పలువురు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.