అనాధ పిల్లలతో ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Monday September 19, 2022
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 18 సెప్టెంబర్ ప్రజా పాలన : ఆప్తులకు ఆపన్న హస్తం అందించడంలో ముందుండే వ్యక్తి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని రెండవ వార్డుకు సంబంధించిన దన్నారం గ్రామంలో గల యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న స్వామి వివేకానంద ఎక్సలెన్స్ పాఠశాలలోని అనాధ పిల్లల మధ్య చేవెళ్ల ఎంపీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల సమక్షంలోనే కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు సైతం ఎంపీ రంజిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  అనాధ పిల్లలకు చైర్ పర్సన్ స్వయంగా కేకు, భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్ చందర్ నాయక్, నాయకులు మాలె లక్ష్మణ్, న్యాయవాది పట్టణ టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జుంజురు ప్రదీప్ కుమార్ ( దీపు ) తదితరులు పాల్గొన్నారు.