బెల్లంపల్లిలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ

Published: Saturday September 17, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి:  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16 నుండి 18 వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో స్థానిక తిలక్ స్టేడియం నుండి నెంబర్ 2 గ్రౌండ్ వరకు  భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 75 సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ
 ప్రజల పోరాట పటిమ, సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అందరికీ తెలిసేలా వివిధ కార్యక్రమాలను రూపొందించారని అందులో భాగంగానే వజ్రోత్సవాల సమైక్యత ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు.
మూడు రోజుల వజ్రోత్సవాల్లో భాగంగానే 16న  బెల్లంపల్లి నియోజకవర్గకేంద్రంలో  15 వేల మందితో జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో, జెడ్పి వైస్ చైర్మన్ టి. సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, జిల్లా పరిషత్ సీఈవో నరేందర్, డి ఆర్ డి ఓ శేషాద్రి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవి, ఎసిపి ఎడ్ల మహేష్,ఎంఆర్ఓ,కుమార స్వామి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు, యువతీయువకులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వర్తకులు, వ్యాపారస్తులు ప్రజలు, తదితరులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 
 
Attachments area