సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్

Published: Thursday September 15, 2022

జగిత్యాల, సెప్టెంబర్14 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ 24 వ వార్డ్ కి చెందిన ధ్యావర శెట్టి జనార్దన్ కి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 1 లక్ష 25 వేల రూపాయల విలువగల చెక్కును, అలాగె 44 వ వార్డు కి చెందిన అర్వపల్లి రాజేశం కి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 1 లక్ష 30 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు ఇంటికి  వెళ్లి స్వయంగా  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేసినారు. వారివెంట వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ లు బోడ్ల జగదీష్, అల్లే గంగ సాగర్, జుంబర్తీ రాజ్ కుమార్, నాయకులు భోగ ప్రవీణ్, మంచాల కృష్ణ, టివి సూర్యం, వోద్దిరామ్మోహన్ రావు, అర్వపల్లిశ్రీనివాస్, రాజేందర్,దాసరి ప్రవీణ్, దాసు, గంప వేణు, శ్రీనివాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.