న్యూస్ 5 ఫోటోలు పెట్టండి సార్
ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి.
*కబ్జాకు గురైన నాలా కల్వర్టు.. రహదారిపైకి చేరుతున్న వర్షపు నీరు
నీరు వెళ్లే దారిలేక నీట మునిగిన సాగర్ రహదారి
ఇబ్బందుల్లో ప్రజలు, ప్రయాణీకులు
పట్టించుకోని అధికారులు.. నోటీసులు సరి*
ఇబ్రహీంపట్నం బాగాయత్ 225 సర్వే నంబర్ లోని నాలా కల్వర్టు ను కొంత మంది కబ్జా చేశారు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు పోయే అవకాశం లేక వర్షపు నీరు సాగర్ రహదారిని ముంచేస్తుంది. మండల పరిధిలోని శేరిగుడా -చింతపల్లి గ్రామాల మధ్య వర్షపు నీరు వెళ్లేందుకు ఉన్న కలువ పూర్తిగా కబ్జా కొరల్లోకి వెళ్ళింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మంగళ్ పల్లి గ్రామ రెవెన్యూ నుండి శేరిగుడా - చింతపల్లి గ్రామాల మీదుగా పురందరి వాగు, తట్టిఖానా వాగులకు చేరాల్సిన వర్షపు నీరు సాగర్ రహదారిపై నిలుస్తోంది. ఫలితంగా సాగర్ రహదారి పూర్తిగా జలమయమవుతోంది. ఈ రహదారి గుండా వేలాది సంఖ్యలో ప్రయాణించే ప్రయాణికులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. నాలా భూములు కబ్జా తో మంగల్ పల్లి గ్రామ సమీపంలోని వెంకటేశ్వర రైస్ మిల్ ప్రహారీ గోడ కూలి అటునుండి నీరు వెళ్లే నాలా కు అడ్డుగా కొంత మంది పెద్ద పెద్ద రాళ్ళను, మట్టిని అడ్డుగా పోయడంతో వర్షపు నీరు సాగర్ రహదారిపై నుండి పారుతోంది. సాగర్ రహదారి ప్రక్కగా పెద్ద ఎత్తున నీటి కుంట ఏర్పడి చిన్నపాటి చెరువును తలపిస్తోంది. గత ఎన్నో ఏళ్లుగా వర్షపు నీరు యదావిధిగా నాలా నుండి పారేది. అయితే అక్కడి భూముల యాజమానులు కృష్ణారెడ్డి, బలవంత రెడ్డి లు నాలా ను కబ్జా చేసి నీరు దారి మళ్ళించే ప్రయత్నం చేశారని దీంతో నీరు వెళ్లే అవకాశం లేక రహదారి పై నుండి పారుతోంది రైతు జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ప్రయాణీకుల సమాచారంతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, ఇరిగేషన్ ఏఈ సాయికుమార్, అర్ఎండ్ బి అధికారులు సాగర్ రహదారిని పరిశీలించారు. నీటిని సాగర్ రహదారి కింద కాకుండా నాలా కల్వర్తు కింద నుంచి అదేవిధంగా తాత్కాలిక చర్యలు చేపట్టారు.
*పట్టించుకోని అధికారులు.. నోటీసులు సరి*
కొంత మంది ఏకంగా ఇబ్రహీంపట్నం బాగాయత్ 225 సర్వే నంబర్ లోని నాలా కల్వర్టు ను కబ్జా చేశారు. ఈ విషయం సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే కబ్జా ను గుర్తించిన అధికారులు కబ్జా దారులతో కుమ్మక్కై కేవలం నోటీసులు సరిపెట్టరాన్న ఆరోపణలు పక్క భూముల రైతుల నుండి వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వానికి రాజకీయ ఒత్తిళ్లు మరో కారణం అవుతున్నాయని దీంతో
అధికారులు నాలాకబ్జాను పట్టించుకోవడం లేదు.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
*శేరిగూడ కౌన్సిలర్ ఈర్లపల్లి సునీతా వెంకట్ రెడ్డి*
నాలా కల్వర్టు ను కబ్జా చేసి వర్షపు నీటిని దారిమల్లిస్తున్నారని, దీంతో సాగర్ రహదారిపై నీరు చేరి ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారని గతంలోనే సంబంధిత శాఖల అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని శేరిగూడ వార్డు కౌన్సిలర్ ఈర్లపల్లి సునీతా వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, అర్ఎండ్ బి అధికారులకు ఎన్నో సార్లు ఈ సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినా వారు పట్టించుకోలేదని దీంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నాలా కల్వర్టును కబ్జా చేసిన వారితో చర్చించి నాలాను పునరుద్ధరించాలని నీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...