ప్రజా సమస్యలపై పాల్గొన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ జిల్లా క
రామోజీ ఫిలింసిటీలో ఇంటి పట్టాలు ఇచ్చిన వారికి స్థలం కేటాయించాలి, దండుమైలారం హఫీజ్ పుర రైతులకు పట్టాదారు పాసు బుక్ లు ఇవ్వాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగాల్ల భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని వినపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం హామీలు తప్ప అమలు చేయడం లేదని తెలిపారు. ఏండ్లు గడుస్తా ఉన్న కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారు. 7 సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూంల హామి అమలు కావడంలేదు. 2007లో రామోజీ ఫిలిం సిటీ లో 189 సర్వే నెంబర్ లో 700 మందికి ఇంటి సర్టిఫికెట్లు ఇచ్చారు. దండుమైలారంలో 149 సర్వే నెంబర్లో 70 మందికి ఇంటి పట్టాలు ఇచ్చిన వారికి ఇంటి స్థలం కేటాయించాలి. దండుమైలారం ఆఫీస్ పూరలో సాగుచేసుకుంటున్న రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలి తులేకలాన్ గ్రామంలో 235లో సాగు చేసుకుంటున్న దళితులకు ధరణిలో ఎక్కించాలని తెలిపారు. కప్పపాడు గ్రామంలో 100 ఎకరాల బినామీ భూమిని వ్యవసాయ కూలీలు సుప్రీంకోర్టు హైకోర్టు జిల్లా కోర్టులను ఆశ్రయించడంతో 50బి ని రద్దు చేయడం జరిగింది ఈ భూమిని భూస్వామినుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమిలేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. పోల్కపల్లి గ్రామంలో పోరాడి సాధించుకున్న భూమి టిఆర్ఎస్ నాయకుని ఆధీనంలో ఉన్న 3ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచాలి. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు 7 వారాల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వర్తింపజేయాలి. డ్వాక్రా పొదుపు సంఘాలకు పావలా వడ్డీ రుణాలు వెంటనే విడుదల చేయాలి. స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి. పెరిగిన వంట గ్యాస్, డీజిల్, పెట్రోలు, నిత్యవసర సరుకుల ధరలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శవర్గ సభ్యులు సామేల్, మండల కార్యదర్శి జంగయ్య, మండల నాయకులు వెంకటేష్, గణేష్, బుగ్గరాములు, జగన్, లింగస్వామి, నర్సింహా, యాదగిరి, మల్లేష్, జంగయ్య, రమేష్, దాసు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...