బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ కావాలి.
గడపగడపకు సిపిఐ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామడుగు లక్ష్మణ్.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 17, ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని, త్యాగాలతో సాదించుకొన్న రాష్ట్రంలో బంగారు తెలంగాణ కాదు నేడు బతుకు తెలంగాణ కోసం పోరాటం సాగించవలసిన పరిస్థితి ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రామడుగు లక్ష్మణ్ అన్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా గడపగడపకు సీపీఐ కార్యక్రమం సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. అనేకమంది త్యాగధనుల అమరత్వంతో ఎరుపెక్కిన ఎర్రజెండ ప్రజాసమస్యల పరిష్కారమే మార్గంగా, భిన్నత్వంలో ఏకత్వంగా దేశ ఐక్యతే ధ్యేయంగా సాగిస్తున్న పోరాటాల క్రమంలో డిసెంబరు 26తో సిపిఐ 95 వసంతాలను పూర్తి చేసుకొందని ఆయన పేర్కొన్నారు. బ్రిటీష్ వలసవాదుల పాలనలో సాగిన దుష్టకృత్యాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూరులో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. రాజకీయ పార్టీలు మతాన్ని రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం అనైతికం, రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. జనాకర్షణ విధానాలతో ప్రజలను మభ్యపెట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏకపక్ష నిరంకుశ పాలనతో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రైతులకు లక్ష రూపాయలు రుణం మాఫీ, నిరుద్యోగులకు రూ.3016 నెలసరి భృతి, దళిత గిరిజనులకు మూడెకరాల భూమి, ఇళ్లస్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాల కల్పన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర సాగుతున్నదని. ఉపాధి కూలీలకు నిధులలో అంతులేని జాప్యం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్ప కాయల లింగయ్య, పట్టణ కార్యదర్శి రాయబారపు వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, నక్క వెంకట స్వామి, ఎఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు దుర్గ రాజు, మహిళా సమైక్య నాయకురాలు ఎలిగేటి వజ్ర, సిపిఐ నాయకులు రాయబారపు జనార్ధన్, మామిడి గోపి, ఎండి రసూల్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...