వరద ముంపుకు గురైన బాధితులను పరామర్శించిన - ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల టౌన్, జూలై 15, ప్రజాపాలన : మంచిర్యాలలో వరద ముంపుకు గురైన బాధితుల పరామర్శించి, వారి దీనస్థితిని చూసిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కరాల సురేఖ చలించిపోయారు. ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉదృతం గా ప్రవహించగా రాళ్లవాగు బ్యాక్ వాటర్ తో ఎన్టీఆర్ నగర్ , రామ్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం వారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఎన్టీఆర్ కాలనీ, రామ్ నగర్ లో నీట మునిగిన ఇండ్లను చూసి ఆందోళనకుగురయ్యారు. వరద ముప్పు మిగిల్చిన నష్టాలను తెలుసుకొని ఆవేదన చెందారు. తాగడానికి , తినడానికి తిండి లేదని విద్యుత్ సరఫరా లేదని బాధితులను వారికి మొరపెట్టుకున్నారు. కేవలం నలుగురు మున్సిపల్ సిబ్బంది మాత్రమే పారిశుద్ధ నిర్వాహణ పనులు చేస్తుండడంతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిందని బాధితులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తో ప్రేమ్ సాగర్ రావు స్వయంగా చర్చించి, కనీసం 50 మంది సిబ్బందిని నియమించాలని ఆయన సూచించారు. తాగునీరు సరఫరా కోసం సొంతంగా తాగునీటి ట్యాంకర్లను ఎన్టీఆర్ కాలనీ, రామ్ నగర్ ఇతర ముంపు ప్రాంతాల్లోని బాధితులకు నీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే చెత్తాచెదారం తొలగించేందుకు సొంత ఖర్చులతో కార్మికులను నియమించారు. ఇంట్లోని బురద నీరు బయటకు తొలగించడం బాధితులకు కష్టతరం కావడంతో ఫైర్ ఇంజన్ల ద్వారా నీటితో ఇళ్లను పరిశుభ్రం చేయాలని ఆయన ఆలోచన చేశారు. వెంటనే అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించగా అగ్నిమాపక వాహనాన్ని పంపేందుకు అంగీకరించారు. రాంనగర్ లోని డూప్లెక్స్ అపార్ట్మెంట్లో జరిగిన భారి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారుల తప్పిదం వల్ల వరద నష్టం జరిగిందని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం గోదావరి బ్యాక్ వాటర్ తో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతున్నాయని వారు తెలిపారు. వరద ముంపు గురైన బాధితులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంటనే రంగంలోకి దిగారని తెలిపారు. తాగునీరు అల్పాహారం భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మాతా శిశు కేంద్రం గోదావరి తీరాన నిర్మించవద్దని మొరపెట్టుకున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పెడ చెవినపెట్టి భవనం నిర్మించారని ఇప్పుడు అది వరద నీటిలో మునిగి పోయిందని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అందులోని రోగులను వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రి తీసుకువచ్చారని, లేకపోతే వారు వరద నీటిలో చిక్కుకుపోయేవారని వారు వివరించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తు లో వరద నీరు ఇళ్లలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఆలోచన చేయాలని వారు సూచించారు. వరద బాధితులకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు అందించడానికి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...