ఇంటర్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన గుమస్తా కూతురుమట్టిలో మాణిక్యం మేఘనఇంటర్లో మేఘనకి
మధిర జూన్ 29 ప్రజాపాలన ప్రతినిధి చదువుకు పేదరికం అడ్డుకాదని, కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు అని ఒక దళిత విద్యార్థిని నిరూపించారు. ఒక కుగ్రామము నుండి వచ్చిన ఓ విద్యార్థిని పట్టుదలతో చదివి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. మధిర నియోజకవర్గం పరిధిలోని ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామానికి చెందిన చింతమాల మేఘన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో ఎంసిపి విభాగంలో 1000 కి 985 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన మేఘన పేద దళిత కుటుంబంలో జన్మించారు. తండ్రి చింతమాల ఆశీర్వాదం ఖమ్మంలో ఒక న్యాయవాది వద్ద గుమస్తాగా పని చేస్తుండగా తల్లి సుహాసిని గృహిణిగా ఉన్నారు. చిన్నతనం నుండి మేఘన చదువుల్లో చురుకుగా ఉండటంతో తండ్రి ఆశీర్వాదం తన కుమార్తెను మంచి స్కూల్లో చేర్పించి బాగా చదివించాలని లక్ష్యంతో చింతమాల ఆశీర్వాదం వల్లబి నుండి ఖమ్మంకు మకాం మార్చారు. అనంతరం ఖమ్మం కోర్టులో న్యాయవాది వద్ద గుమాస్తాగా పనిలో చేరి కష్టపడి పనిచేసి వచ్చిన నామమాత్రపు వేతనంలో కొంత కుమార్తె మేఘన చదువుకు ఖర్చు పెట్టారు. ప్రాథమిక విద్యను ఖమ్మం విజ్ఞాన్ పాఠశాలలో పూర్తి చేసిన మేఘన 6వ తరగతి నుండి నుండి 10వ తరగతి వరకు ఖమ్మం సెంట్ జోసెఫ్ పాఠశాలలో చదివారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేఘన పదవ తరగతిలో టెన్ బై టెన్ మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలిచారు. ఇంటర్మీడియట్ చదివేందుకు ఖమ్మం శ్రీ చైతన్య కళాశాలలో చేరి కష్టపడి చదివి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 464 మార్కులతో నాలుగో ర్యాంకును సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 985 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మేఘన మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించినట్లు ఆమె తెలిపారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు సాధించిన చింత మాల మేఘనని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు చింతకాని ముదిగొండ మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి సామినేని రవి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మేఘనని స్ఫూర్తిగా తీసుకొని చదువుకోవాలన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతమాల ఆశీర్వాదం పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...