పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న నాయకులుపాదయాత్రలకు బ్రహ్మరథం పడుతున్న మధిర ప్రజలువి
మధిర జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మరో 15 నెలల్లో జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజల్లోకి ఉండేందుకు పాదయాత్రల బాట పట్టాయి. మధిర నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కాంగ్రెస్ వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు పాదయాత్రలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. దీనికి దీటుగా టిఆర్ఎస్ నేతలు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్లి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. మధిర శాసనసభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియోజకవర్గంలోని బోనకల్ మండలంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. ఇటీవల బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధిర మండలంలో పాదయాత్ర పూర్తి చేశారు. వామపక్ష పార్టీలు విద్యుత్ ఛార్జీల పెంపు గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యావసర ధరల పెంపు బస్సు చార్జీలు పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళుతుంది. నియోజకవర్గంలో దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజల్లో ఉండేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల మధిరలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు భారీగా జనసమీకరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాల్గొని టిఆర్ఎస్ పాలనను ఎండగట్టారు. నియోజకవర్గంలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర కనివిని ఎరుగని రీతిలో విజయవంతమైంది. మధిర అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన సభకు ప్రజల భారీస్థాయిలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటైన విమర్శలు చేశారు. ఇటీవల మధిరలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనలోనే మధిర అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక చోట జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోనే ఉంటున్నారు. అదే విధంగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం పరామర్శల పేరుతో నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వివిధ కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టడంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...