ఉపకార వేతనాలు చెల్లించాలంటూ ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం చౌరస్తాలో పెండింగ్ లో ఉన్న ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంగ సంజీవ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో నేడు ప్రభుత్వం విద్యార్థులను ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ లు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడం దారుణమని అన్నారు. స్కాలర్షిప్ లు ప్రభుత్వ భిక్ష కాదు, పేద విద్యార్థుల హక్కు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థులు సర్టిఫికేట్లు అందక ఉద్యోగాలకు ఇబ్బందిగా మారింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని పెండింగ్ లో ఉన్న ఉపకారవేత్తనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ లు వెంట వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. విద్యరెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఆర్థిక శాఖ సరిగా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని విద్యార్థులను వేధిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పైనే ఆశలు పెట్టుకున్న అనేక మంది పేద విద్యార్థులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. నిధుల కొరత కారణంగా రాష్ట్రంలో ఉన్నత, వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న 12.5 లక్షల మంది విద్యార్థులకు రూ3,816 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఆర్థిక శాఖ స్తంభింపజేసింది. ఈ బకాయిలు గత రెండేళ్లుగా పేరుకుపోయాయి. కొన్ని కాలేజీల మేనేజ్మెంట్లు కోర్సులు పూర్తయిన తర్వాత కూడా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెనక్కి తీసుకుంటున్నాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం 2019-20లో 1,500 కోట్ల రూపాయల బకాయిలను ఇటీవల విడుదల చేయడానికి ఆర్థిక శాఖ సంక్షేమ శాఖలకు టోకెన్లను కూడా జారీ చేసింది. కానీ ఆకస్మాత్తుగా చెల్లింపులను ఆపేసింది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షల కన్నా తక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, బీసీ, ఈబీసీ మరియు మైనారిటీ విద్యార్థులు వార్షిక కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల కన్నా తక్కువ మరియు పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉన్న వారు ఈ ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు. ప్రతీ సంవత్సరం, దాదాపు 5.45 లక్షల మంది కొత్తగా ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేకుంటారు. దాదాపు 7.99 లక్షల మంది రెన్యువల్ చేసుకుంటారు. ప్రభుత్వం సంవత్సరానికి రూ.2,300 కోట్లను ఫీజు రీయింబర్స్ కోసం విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరానికి కేవలం రూ.784 కోట్లను మాత్రమే విడుదల చేసింది. మరియు 2020-21 సంవత్సరానికి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ టెక్నీకల్ సెల్ కన్వీనర్ శశిధర్ రెడ్డి, నగర కార్యదర్శి హేమంత్ కుమార్, మహిళా నాయకులు అర్పిత, నాయకులు వినోద్, రాజు, శేఖర్, సిద్దు, శివానందు, అభిలాష్, అరవింద్, సాయికృష్ణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...