అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కాల్చి వేయాలి
కోరుట్లలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో
కోరుట్ల, అక్టోబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసే నిందితులను ఇకనుండి కాల్చి వెయ్యాలని అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాలలో మహనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. కొంతమంది దేశద్రోహులు పనిగట్టుకొని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టం తీసుకువచ్చి అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసే వారిని గుర్తించి కాల్చి వేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాలకు అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచంలోని ఇతర దేశాలలో అంబేద్కర్ ను దైవంగా భావిస్తూ పూజిస్తున్నారు అని తెలిపారు. మన దేశానికి దిశానిర్దేశం చూపిన మహనీయునికి అవమానం జరగటం చాలా బాధాకరం అన్నారు. అంబేద్కర్ దేశ ప్రజలందరికీ దైవం లాంటి వాడిని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. బైంసాలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు ఉయ్యాల నర్సయ్య, బలిజ రాజారెడ్డి, రాసా భూమయ్య, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, కార్యదర్శి చిట్యాల కరుణాకర్, కల్లూరు సర్పంచ్ వంతడుపుల అంజయ్య, కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజo, సంఘ నాయకులు సామల వేణుగోపాల్, కంభం ఆనంద్, ఉయ్యాల శేఖర్, బలిజ శివప్రసాద్, ఇంద్రాల హరీష్, సామర్ల దశరథం, నగేష్, కృష్ణంరాజు, వికాస్, గంగాధర్, గంగారెడ్డి, పట్టణ మండలం అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...