అభివృద్ధి పనుల లక్ష్యాలను అన్ని శాఖల సమన్వయంతో పూర్తి చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 16, ప్రజాపాలన : రాష్ట్రంలో ఆయా జిల్లాల వారిగా కేటాయించిన అభివృద్ధి పనుల లక్ష్యాలను సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి, పట్టణాలను ఆధునీకరించడం కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాల పెండింగ్ పనులను వేగవంతం చేయాలని కోరారు, లే-అవుట్ భూములను క్రమబద్దీకరించా లని, డంపింగ్ యార్డులు, వైకుంఠధామం (స్మశానవాటిక) పనులతో పాటు పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. అంతర్గత మార్కెట్, పశు సంవర్ధకశాఖ పనులు ప్రణాళికబద్ధంగా చేయాలని పేర్కొన్న ఆయన వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలకుండా త్రాగునీటి విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనులపై పర్యవేక్షిస్తూ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసి పరిరక్షించాలని తెలిపారు. హరితహారం కార్యక్రమం కోసం నర్సరీలలో మొక్కల పెంపకంతో పాటు బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు కూరగాయలు, మాంసం విక్రయ మార్కెట్లను పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం హరితహారం లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందని, 2021-22 సంవత్సరానికి గాను ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో దాదాపు డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో క్లోరినేషన్ తో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, జిల్లా అటవీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు, పంచాయతీరాజ్ ఈ.ఈ.ప్రకాష్, రోడ్లు, భవనాల శాఖ ఈ.ఈ.రాము, మున్సిపల్ కమీషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...