నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఆసిఫాబాద్ జిల్లా జూన్ 01, ప్రజాపాలన, ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కార్మికుల జీవితాలలో వెలుగు నిండేనా,? టిఆర్ఎస్ ప్రభుత్వం హంగామా, ఆర్భాటాలతో, సంబరాలు జరుగుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా అల్లూరి లోకేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం హంగు, ఆర్భాటాలతో, సంబరాలు జరుగుతుందని, తెలంగాణ సాధన కోసం అనేకమంది ప్రజలు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగ, కార్మికులు, ముందు నిలబడి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పోరాటాలు చేశారన్నారు. నిధులు నియామకాల సాధన కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని, రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యోగ, కార్మికుల, పరిస్థితులు, బతుకులలో మార్పులు, వచ్చి జీవితాలలో ఎలాంటి వెలుగులు కనబడడం లేదన్నారు. నేడు జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి కేటాయించిన నిధులు, అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి వివరణ ఇచ్చి నిధులు ప్రకటించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం, వర్క్ బెస్ట్ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు, ఆశ, అంగన్వాడి, వైద్య రంగాలలో, పనిచేస్తున్న ఉద్యోగులు, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు, మధ్యాహ్న భోజన, ఉపాధి హామీ, పంచాయతీ మున్సిపాలిటీ ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగ భద్రత కనీస వేతనాలు రూ 21వేలు ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ లను, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని, సంగతిత, అసంఘటిత, రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు పని దినాలు కల్పించాలని, అన్ని విధాలుగా కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. అవతరణ సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన కాలేజీలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా తో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలని, రేషన్ షాపుల ద్వారా 18 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు. ముందు వరుసలో నిలబడి కరోనా రోగులకు ప్రజలకు సేవలందిస్తూ చనిపోయిన వారికి రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సమస్యలను పరిష్కారం చేసినప్పుడే సంపూర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ, సాధ్యమవుతుందని, ఆకలి కేకలు లేని తెలంగాణలో అందరూ సుఖశాంతులతో ఉండాలంటే, ఇప్పటికైనా నిధులు, నియామకాలు, ఉద్యోగ భద్రతను, కల్పించాలని, కోరుకుంటున్నామన్నారు.
Share this on your social network:
Related News
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన):
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను...
మధిర రాష్ట్ర వ్యాప్తంబ్గా గొర్రెలు మేకల పెంపకం దారులకు తక్షణ...
*ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు* కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్...
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెందెం లలిత, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ప్రచారం లేన...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూట...
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలోని ప్రతిభ గ్రామర్ పాఠశాలలో ల...
వలిగొండ ప్రజాపాలన మండల పరిదిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో ఇటీవల ...
వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన). : వెల్గటూర్ మండలం లోని గుల్లకోట ...
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో...
◆ ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలికాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగం
మధిరఈరోజుఈరోజు మధిర టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గారు ఉదయ్ కుమార్ గారి క...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం , జగద్గిరిగుట్ట , రంగా...
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభి...
*వ్యయసాయ మార్కెట్ కమిటీ కార్యాలయము:మధిర* ఆన్లైన్లో దరఖాస్తు కు సూచన తాసిల్దార్ సంయుక్త రిజిస్ట్రార...
ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల ర...
మధిరఈరోజుమధిరఈ రోజు గౌరవ అడి ష నల్ క లే క్ట ర్ ఖ మ్మం గారు న...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 04 ( ప్రజాపాలన ) : ఆగ్రా న...
గొల్లపల్లి, పిబ్రవరి 04 (ప్రజాపాలన): గొల్లపల్లి మండ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, ఫిబ్రవరి 04, ప...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. మంచిర్యాలజిల్లా ప్రతినిధి, పిబ్రవరి04, ప్రజాపాలన:...
ప్రభుత్వ విద్యసంస్థలకు ఉచితంగా మాస్కులు,శ...
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపా...
భార్యను భర్తె కడతేర్చినట్లు పోలీసుల అనుమానం**పె...
మధిర ఈరోజు మహంకాళి అప్పారావు గారి జ్ఞపకార్థము వ...
మధిర నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జడ్పీ నిధు...
మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాల...
క్యాతన్ పెల్లి, పిబ్రవరి 07, ప్రజాపాలన, వలిగొండ ప్రజాపాలన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సి...
మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచ...
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపా...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామంలోని మూ...
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఇంటర్మీడ...
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ మున్సిపల్...
*ప్రభుత్వ సివిల్ ఆస్పత్ర...
జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; అటల్ బీహార్ వాజ్ప...